Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ దళాల దాడి.. 74మంది ఐసిస్ జీహాదీల మృతి.. ఆపరేషన్ ఓవర్..

ప్రపంచ దేశాలను వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు భరతం పట్టేందుకు ఇరాక్ దళాలు నడుంబిగించాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను కిర్కుక్ నగరం నుంచి తరిమికొట్టేందుకు ఇరాక్ దళాలు చేపట్టిన ఆపరేషన

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (16:27 IST)
ప్రపంచ దేశాలను వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు భరతం పట్టేందుకు ఇరాక్ దళాలు నడుంబిగించాయి. ఈ క్రమంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను కిర్కుక్ నగరం నుంచి తరిమికొట్టేందుకు ఇరాక్ దళాలు చేపట్టిన ఆపరేషన్ సోమవారంతో ముగిసింది.

దళాల దాటికి తట్టుకోలేని ఉగ్రవాదులు కొందరు పారిపోగా, మరికొందరు ఆర్మీకి ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు తమను తామే పేల్చేసుకున్నారు. ఇరాక్ దళాల దాడిలో మొత్తం 74 మంది జిహాదీలు మృతి చెందినట్లు గవర్నర్ ప్రకటించారు. 
 
ఇంకా ఐసిస్‌పై దాడులు ముగిశాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందని కిర్కుక్ ప్రావిన్స్ గవర్నర్ నజ్మెద్దీన్ కరీమ్ వెల్లడించారు. ఇరాకీ దళాలు మొత్తం 74 మంది ఐసిస్ ఉగ్రవాదులను మట్టబెట్టగా ఐసిస్ చీఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు కరీమ్ పేర్కొన్నారు.

అలాగే ఐసిస్ టెర్రరిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లోనూ టెర్రరిస్టుల భరతం పట్టేందుకు ఇరాక్ సంయుక్త దళాలు పోరాడుతాయని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments