Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంల

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (09:35 IST)
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న కొండప్రాంతమైన రంగమతి జిల్లాకు చెందినవారే. మృతుల్లో ఓ మేజర్‌, ఓ కెప్టెన్‌ సహా ఐదుగురు సైనిక సిబ్బంది ఉన్నారు.
 
రంగమతిని చిట్టగాంగ్‌ను కలుపుతూ ఉన్న ప్రధానరహదారిపై పేరుకున్న రాళ్లు, రప్పల తొలగింపు చర్యల్లో పాల్గొంటుండగా.. కొండ చరియలు విరిగిపడి వీరు మరణించినట్లు తెలిపారు. దాదాపు 100 మందికిపైగా గాయాలపాలయ్యారని.. మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. 
 
రుతుపవన వర్షాలతో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో చాలా వరకు మారుమూల ప్రాంతాలకు సహాయ చర్యలు అందించడం కష్టతరంగా మారింది. మరణాల్లో ఎక్కువ శాతం కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే సంభవించగా.. విద్యుదాఘాతానికి గురవడం, నీటిలో మునగడం, గోడలు కూలడం తదితర ఘటనల్లో మరికొందరు మరణించారని సైనిక అధికారులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments