Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంల

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (09:35 IST)
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న కొండప్రాంతమైన రంగమతి జిల్లాకు చెందినవారే. మృతుల్లో ఓ మేజర్‌, ఓ కెప్టెన్‌ సహా ఐదుగురు సైనిక సిబ్బంది ఉన్నారు.
 
రంగమతిని చిట్టగాంగ్‌ను కలుపుతూ ఉన్న ప్రధానరహదారిపై పేరుకున్న రాళ్లు, రప్పల తొలగింపు చర్యల్లో పాల్గొంటుండగా.. కొండ చరియలు విరిగిపడి వీరు మరణించినట్లు తెలిపారు. దాదాపు 100 మందికిపైగా గాయాలపాలయ్యారని.. మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. 
 
రుతుపవన వర్షాలతో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో చాలా వరకు మారుమూల ప్రాంతాలకు సహాయ చర్యలు అందించడం కష్టతరంగా మారింది. మరణాల్లో ఎక్కువ శాతం కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే సంభవించగా.. విద్యుదాఘాతానికి గురవడం, నీటిలో మునగడం, గోడలు కూలడం తదితర ఘటనల్లో మరికొందరు మరణించారని సైనిక అధికారులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments