పాక్‌కు షాకిచ్చిన మోడీ.. బలూచిస్థాన్‌లో ప్రారంభమైన ఆకాశవాణి ప్రసారాలు

పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారు. బలూచిస్థాన్‌లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించారు. దీన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇప్పటికే.. బలూచిస్థాన్‌ విషయంలో మోడీ తన వైఖరిని

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:40 IST)
పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారు. బలూచిస్థాన్‌లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించారు. దీన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇప్పటికే.. బలూచిస్థాన్‌ విషయంలో మోడీ తన వైఖరిని తేటతెల్లం చేసిన విషయం తెల్సిందే. ఇపుడు మరోసారి పాక్‌ను కలవరపాటుకు గురిచేసింది. 
 
బలూచిస్థాన్‌లో శుక్రవారం నుంచి ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్ వ్యవహారంలో తలదూర్చిన భారత్‌పై ఇప్పటికే మండిపడుతున్న పాక్‌ తాజా ఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బలూచ్‌లో ఆకాశవాణి ప్రసారాలపై ప్రధాని మోడీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
 
భారత్ ప్రకటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ తమ దేశంలో డీటీహెచ్ ద్వారా ప్రసారమవుతున్న భారత్ టెలివిజన్ చానళ్లను నిషేధించింది. అయినా ఏమాత్రం తగ్గని భారత్ అనుకున్నట్టుగానే బలూచిస్థాన్‌లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించింది. ఈ మేరకు బలూచ్ ప్రజల కోసం బలూచ్ భాషల్ మల్టీమీడియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీంతో ఇక నుంచి బలోచ్ ప్రజలు ఆకాశవాణి కార్యక్రమాలను, వార్తలను నేరుగా వినొచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments