Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిండం.. పసిపాపగా ప్రాణం పోసుకుంది.. అమెరికాలో అరుదైన ఘటన..!

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (19:47 IST)
ఒక సంవత్సరం కాదు.. 27 ఏళ్ల పాటు శీతలీకరణ స్థితిలో వున్న పిండం.. పసిపాపగా ప్రాణం పోసుకుంది. ఈ అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టెనెస్సీకి చెందిన టీనా, గిబ్సన్ దంపతులు 27ఏళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న పిండంకు జీవం పోశారు. 1992లో శీతలీకరణ స్థితిలో భద్రపరిచిన పిండాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో టీనా, గిబ్సన్ దంపతులు దాత నుంచి దత్తత తీసుకున్నారు. 
 
అనంతరం వైద్యులు ఆ పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆమె గత నెలలో పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆ దంపతులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. ఈ విషయంపై స్పందించిన నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ దీన్ని ఒక రికార్డుగా అభివర్ణించింది. 
 
27ఏళ్లపాటు శీతలీకరణ స్థితిలో ఉన్న పిండం ప్రాణం పోసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవని తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పిండంకు ప్రాణం పోసిన అమెరికా దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments