Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ రెస్టారెంట్ ఐఎస్ఐఎస్ నరమేధం... 74 మంది హతం

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్‌ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (09:31 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్‌ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంటుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఆపై అక్కడికి దగ్గరలోనే ఉన్న చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో 74 మంది మృతిచెందగా, మరో 91 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలో పరిస్థితి భీతావహంగా ఉందని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 
 
కాగా, భద్రతా బలగాలతో కలసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షియా సంస్థ 'హషీద్ అల్ షాబి' సభ్యుల రూపంలో వచ్చిన ముష్కరులు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments