Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో నరమేథం.. పార్కులో మానవబాంబు దాడి.. 70 మృతి

Webdunia
సోమవారం, 28 మార్చి 2016 (09:03 IST)
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. లాహోర్‌లోని ఓ ప్రముఖపార్కులో ఆదివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 70 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. దాదాపు మరో 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఈస్టర్‌ సందర్భంగా పంజాబ్‌ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లోని గుల్షాన్‌-ఇ-ఇక్బాల్‌ పార్కులో క్రైస్తవులు సహా అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా ఆత్మాహుతి దాడి సభ్యుడు పార్కు ప్రధాన గేటు వద్ద సాయంత్రం 6.40 సమయంలో తనను తాను పేల్చసుకున్నట్లు లాహోర్‌ పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హైదర్‌ అష్రాఫ్‌ వెల్లడించారు. 
 
ఆత్మాహతి దాడి కోసం 8-10 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం క్రైస్తవులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఆత్మాహుతికి పాల్పడ్డ వ్యక్తిదిగా భావిస్తున్న తలను ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, తెగిపడిన అవయవాలు, రక్తంతో పేలుడు అనంతరం పార్కు ఆవరణ భీతావాహంగా మారింది. మరోవైపు, దాడికి పాల్పడింది తామేనని తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) చీలిక విభాగమైన జమాతుల్‌ అహ్రర్‌ ప్రకటించింది. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments