Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం... 62 మంది చిన్నారులు బలి..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:14 IST)
యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా అభంశుభం తెలియని 62 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) ప్రకటించింది. గత కొన్ని రోజులుగా యెమెన్లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
 
ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘యెమెన్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్య, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలు బాంబు దాడుల భయంతో వణికిపోతున్నారు.

ఘర్షణలు, దాడులు, ఆహారలేమి, భయాందోళనల కారణంగా 62 మంది చిన్నారులు మృతి చెందగా, 30 మంది చిన్నారులు గాయపడ్డారు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా యెమెన్‌లో ఉన్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు కేంద్రం ఒక విమానం రెండు ఓడలను పంపిన విషయం తెలిసిందే.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments