మధ్యదరా సముద్రంలో పెను విషాదం.. పడవ మునిగి 57 జలసమాధి

Webdunia
బుధవారం, 19 మే 2021 (09:22 IST)
ట్యునీషియా దేశంలో మధ్యదరా సముద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ సముద్రంలో పడవ మునిగిపోవడంతో 57 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 33 మందిని ట్యునీషియాకు చెందిన రెడ్‌ క్రెసెంట్ సంస్థ రక్షించింది. 
 
లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న వలసదారుల పడవ ఒకటి ట్యునీషియా తీరంలో ప్రమాదానికిగురై సముద్రంలో మునిగిపోయింది. ఇటీవల ట్యునిషియా తీరంలో పడవలు ముగిన సంఘటనలు వరుసగా జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడినందున ట్యునీషియా, లిబియా నుంచి యూరప్‌ వైపు వలసలు పెరిగాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉన్నారని.. 33 మంది ప్రాణాలతో బయటపడగా.. వీరంతా బంగ్లాదేశీయులని రెడ్‌ క్రెసెంట్‌ అధికారి మొంగి స్లిమ్‌ పేర్కొన్నారు.
 
కాగా, ట్యునీషియా తీరంలో పడవలు ముగిన ఘటనల్లో ఇటీవల సుమారు 60 మందిపైగా వలసదారులు మరణించారు. ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు సముద్రం మీదుగా వలస వచ్చారని.. చాలా మంది కొత్తగా ఇటలీ, స్పెయిన్‌కు ట్యునీషియా, అల్జీరియా నుంచి వచ్చారని యూఎన్‌హెచ్‌సీఆర్‌ పేర్కొంది. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 633 మంది మృతి చెందారని లేదా గల్లంతైనట్టు ఏజెన్సీ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments