Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (09:56 IST)
వియత్నాం తీరంలో విషాదకర ఘటన జరిగింది. కొందరు ప్రయాణికులతో వెళుతున్న పడవ ప్రతికూల పరిస్థితుల కారణంగా సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 34 మంది జలసమాధి అయ్యారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు తక్షణం రంగంలోకి దిగి 11 మందిని రక్షించాయి. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. 
 
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో హా లాంగ్ బే ఒకటి. ఇక్కడకు 48 మంది పర్యాటకలు ఐదుగురు సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే, ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి బోల్తాపడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పలువురుని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments