Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకర ఘర్షణ.. 23 మంది మృతి

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (15:05 IST)
Armenia-Azerbaijan
ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకరమైన ఘర్షణ చోటుచేసుకుంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రత్యేక ప్రాంతం కోసం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందగా, 100 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. 
 
ఈ ఘర్షణలో 16 మంది అర్మేనియన్ వేర్పాటువాదులు హతమయ్యారు. వందమందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరిగిందని తెలిపింది. ఒక అర్మేనియన్ మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించింది.
 
అర్మేనియన్ వేర్పాటువాదులు ప్రయోగించిన షెల్లింగ్ దాడిలో అజర్‌బైజాన్‌‌కు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. వివాదాస్పదంగా ఉన్న నాగోర్నో-కరాబాఖ్‌లో ఇంతకుముందు కూడా అజర్‌బైజాన్‌, అర్మేనియ బలగాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.
 
వివాదాస్పద ప్రాంతం కోసం ఓ వైపు అజర్ బైజాన్, మరోవైపు అర్మేనియా తీవ్రమైన పోరాటం చేస్తున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఇరువైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా, తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments