Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన భారత్ పర్యటన...! ఒబామాకు మోడీ వీడ్కోలు...!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (17:37 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది.  మంగళవారం మధ్యాహ్నం ఒబామా దంపతులు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు. వారికి ప్రధాని మోడీ, భారత దౌత్య అధికారులు వీడ్కోలు పలికారు. 
 
కాగా, ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోపలికి ప్రవేశించే ముందు ఒబామా, ఆయన అర్థాంగి మిషెల్ భారత వర్గాలకు సంప్రదాయబద్ధంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపి, నిష్క్రమించారు. ఒబామా ఇటీవల మరణించిన సౌదీ రాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
 
అంతకుముందు ఆయన సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ... భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు. అమర జవానులకు తన నివాళులని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే నాడు గార్డ్ ఆఫ్ ఆనర్‌కు ఓ మహిళ నాయకత్వం వహించడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. 
 
భారత్‌లో కుటుంబాలను ఐక్యంగా ఉంచడంలో మహిళలదే కీలకపాత్ర అని తెలిపారు. మహిళల సమానత్వం కోసం అమెరికా కృషి చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత సాధ్యమైనప్పుడే ఏ దేశమైనా పురోగామి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments