Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (09:25 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ నిర్మాణ పనులకు హడ్కో మరో రూ.11 వేల కోట్ల మేరకు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నిధులను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావించింది. ఈ విషయాన్ని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేలు కోట్ల నిధులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి హడ్కో సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments