Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్గనిస్థాన్‌లో భారతీయులందరూ సేఫ్: జర్నలిస్ట్ ట్వీట్

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (16:36 IST)
ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 150 మంది భారతీయులను సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడడం తెలిసిందే. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో వీరిని సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడ్డాయి. భారతీయులకు తాలిబన్లు హాని తలపెట్టవచ్చని తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
వీరితో భారత దౌత్య అధికారులు టచ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కాబూల్ నుంచి భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. భారతీయులను అపహరించిన తాలిబన్లు.. ఆ తర్వాత వారిని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌‌లో క్షేమంగా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు విదేశాలు తీవ్రంగా స్పందించే అవకాశమున్నందునే వారికి ఎలాంటి హానితలపెట్టకుండా తాలిబన్లు విడుదల చేసినట్లు సమాచారం.
 
అటు ఆఫ్గనిస్థాన్ మీడియా వర్గాలు కూడా భారతీయులందరూ సేఫ్‌గా ఉన్నట్లు ధృవీకరించాయి. అయితే భారతీయుల నుంచి పాస్‌పోర్టులు తీసుకుని తమ వెంట ఎవరు తీసుకెళ్లారన్న దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆఫ్గన్‌కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments