Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలి ప్రాంతంలో అల్జీరియా విమాన శకలాల గుర్తింపు!

Webdunia
శనివారం, 26 జులై 2014 (10:59 IST)
అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానమొకటి గురువారం బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కుప్పకూలిపోయిన విమాన శకలాలను మాలి ప్రాంతంలో కనుగొన్నారు. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సహా మొత్తం 116 మంది మృత్యువాతపడ్డారు. ఈ విమానం సహారా ఎడారి ప్రాంతంలో కూలి వుండొచ్చని భావిస్తున్నారు. ఈ విమానం కూలిన ప్రాంతంలో ప్రయాణికుల శరీర భాగాలతో పాటు... విమాన శకలాలను కనుగొన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. 
 
ఈ విమానంలో 51 మంది ఫ్రెంచ్ జాతీయులు, 27 మంది బుర్కినా పాసో పౌరులు, 8 మంది లెబనీసె, ఆరుగురు అల్జీరియన్లు, ఐదుగురు కెనడా పౌరులు, నలుగురు జర్మన్లు, ఇద్దరు లక్సెంబర్గ్‌లు, స్విస్, బెల్జియన్, ఈజిప్టు, ఉక్రెయిన్, నైజీరియన్, కామెరూనియన్, మాలిల దేశాలకు చెందిన ఒక్కో పౌరుడు ఉన్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, కుప్పకూలిపోయిన విమానం గత పదకొండు సంవత్సరాలుగా ఈ విమానం పనిచేస్తూనే వుంది. చాలా పాతబడిపోయిన ఈ విమానం వాతవరణంలోని పీడనాన్ని తట్టుకోలేక కూలిపోయి వుండొచ్చని తెలుస్తోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments