Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయేల్ దాడి.. ఒకే కుటుంబం-19 మంది మృతి

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (20:32 IST)
గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా సిబ్బంది కుటుంబానికి చెందిన 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడిలో ఓ కుటుంబానికి చెందిన 19 మందిని హతమార్చారు.
 
తండ్రి, ఇద్దరు సోదరీమణులు, 8 మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతని సోదరుడు, అతని సోదరుడి భార్య, నలుగురు పిల్లలు, అతని కోడలు, మామ మరణించారని అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది.
 
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు జరిగిన ప్రదేశంలో పాలస్తీనియన్లు క్షతగాత్రుల కోసం వెతుకుతున్నారు. గాజా స్ట్రిప్‌లోని జనసాంద్రత కలిగిన జబాలియా శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది మహ్మద్ అబూ అల్-కుమ్సన్ 19 మంది కుటుంబ సభ్యులు మరణించారని అల్ జజీరా బుధవారం నివేదించింది.
 
ఈ దాడిలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు, హమాస్ కమాండర్ మరణించినట్లు భావిస్తున్నారు. అల్ జజీరా తన టీవీ ఇంజనీర్ మహ్మద్ అబు అల్ కుమ్సాన్ కుటుంబంలోని 19 మందిని చంపిన ఇజ్రాయెల్ బాంబు దాడిని హేయమైన చర్యగా ఖండించింది. పౌరులపై దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని అల్ జజీరా నొక్కి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments