Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 92 మంది జలసమాధి అయినట్టే : ఇండోనేషియా ఆర్మీ అధికారులు

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (09:48 IST)
గత నెలలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియాకు చెందిన క్యూజడ్ 8501 విమాన ప్రయాణికుల్లో 92 మంది జలసమాధి అయినట్టేనని మృతదేహాల కోసం గత నెల రోజులుగా అన్వేషించిన ఇండోనేషియా ఆర్మీ అన్వేషణ బృందం ప్రకటించింది. అయితే, దీనిపై ఇండోనేషియా ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించాల్సి వుంది. ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న అన్వేషణ బృందంలోని పలువురు సభ్యులు కూడా అనారోగ్యం పాలైనట్టు ఆ బృందం ఉన్నతాధికారులు వెల్లడించారు. అందువల్ల ఇంతటితో గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
గత నెలలో ఎయిర్ ఏషియాకు చెందిన విమానమొకటి జావా సముద్రంలో కుప్పకూలిన విషయం తెల్సిందే. ఈ విమాన ప్రమాద మృతదేహాల అన్వేషణను ఇండొనేసియా మిలిటరీ ఉన్నతాధికారులు చేపట్టారు. ఆ విమానంలో మొత్తం 162 మంది ఉండగా, ఇప్పటి వరకు 70 మృతదేహలను వెలికితీశారు. వాతావరణం అనుకూలించకపోవడం, మృతదేహల కోసం అలుపెరగకుండా అన్వేషణ చేయడంతో, బృందంలోని సభ్యులు తీవ్ర అనార్యోగానికి గురైయ్యారని అధికారులు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో సెర్చ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, మరో 92 మంది మృతదేహాలను వెలికితీయాల్సి వుంది. ఇక వారంతా జలసమాధి అయినట్టు మలేషియా ప్రభుత్వం అధికారికి ప్రకటన వెలువరించనుంది. గత సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన విమాన ప్రయాణికులు, సిబ్బందితో సహా 162 మందితో ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలిన విషయం విదితమే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments