Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న ఇండియన్స్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:01 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న భారతీయులను భారత వైమానిక దళం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. కాబుల్​ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం భారత్​కు చేరుకుంది. 
 
ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్​ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్​కు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కాబుల్​ నుంచి వచ్చిన వారికి ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
కాగా, ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో అత్యంత దారుణ ప‌రిస్థితులు నెల‌కొనివున్న విషయం తెల్సిందే. అఫ్గాన్ తాలిబ‌న్ ఫైట‌ర్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి అరాచక పాలనలో జీవించలేక ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. 
 
ఇప్పటికే ఐఏఎఫ్‌ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్‌ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments