Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడాల్ఫ్ హిట్లర్ టాయిలెట్ సీట్ వేలం.. న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ కూడా..?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (20:29 IST)
AdolfHitler
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా ఒకరు. యుద్ధం ముగిసే సమయంలో తనను కాల్చుకొని హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే, హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన గదిలో ఓ టాయిలెట్ ఉండేది. ఆ టాయిలెట్ సీట్‌ను రాంగ్ వాల్డ్ సి బోర్చ్ అనే అమెరికన్ సైనికుడు దొంగిలించాడు. 
 
ఈ టాయిలెట్ సీట్ ను ఫిబ్రవరి 8న మేరీల్యాండ్‌లో వేలం వేస్తారు. వేలంలో ప్రారంభ ధారగా 5000 డాలర్లుగా నిర్ణయించారు. దాదాపుగా 15000 డాలర్లకు ఈ టాయిలెట్ సీట్ అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్టు వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ టాయిలెట్ సీటుపై హిట్లర్‌కు సంబంధించిన ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా ఉంచడం విశేషం.
 
కాగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని అమెరికన్ సైనికులు చుట్టుముట్టిన సమయంలో సైనికుడు ఆ టాయిలెట్ సీట్‌ను దొంగిలించాడు. ఆ తరువాత అక్కడి నుంచి దానిని న్యూయార్క్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. 
 
ఇప్పటి‌వరకు ఆ సీట్ తన వద్దే ఉంచుకున్నారు. ఇప్పటికే ఈ టాయిలెట్ సీటు వాళ్ల ఇంట్లోనే భద్రంగా ఉంది. ఇప్పుడా సైనికుడి కుటుంబ సభ్యులే దీనిని వేలంలో అమ్మి సొమ్ము చేసుకుందామని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments