Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాన్ని పక్షి ఢీకొట్టితే రూ.14 కోట్ల నష్టం వాటిల్లుతుందా?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (10:38 IST)
ప్రచ్ఛన్న యుద్ధకాల సమయంలో అమెరికా అగ్ర నేతలకు రక్షణ కల్పించిన విమానాల్లో ఒకటి బోయింగ్ ఈ-6బి మెర్క్యురీ. ఈ విమానం తయారీకి పది వేల కోట్ల రూపాయల మేరకు ఖర్చు అవుతుంది. అలాంటి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో రూ.14 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. 
 
తాజాగా వెగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని మేరీల్యాండ్‌‌లోని పట్యుక్సెంట్‌ రివర్‌ నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఈ నెల 2వ తేదీ ఓ ఘటన జరిగింది. ఈ-6బి మెర్క్యురీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. 
 
ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా నష్టం మాత్రం భారీగానే జరిగింది. విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతినడంతో ఏకంగా రూ.14 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. విమానం ఖరీదు పదివేల కోట్ల రూపాయలకు పైనే కాగా, ఈ ప్రమాదాన్ని వైమానిక దళం ఎ-క్లాస్ ప్రమాదంగా పేర్కొంది.
 
నిజానికి పక్షి కారణంగా దెబ్బతిన్న విమానానికి చాలా చరిత్ర ఉంది. ఈ-6బి మెర్క్యురీ రకం విమానమైన ఇది  ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించింది. అంతేకాదు, అణుదాడులకు కూడా దీనిని ఉపయోగించారు. అలాంటి విమానం చిన్నపాటి పక్షి ఢీకొట్టడంతో అపార నష్టంవాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments