Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్ అరాచకాలలో ఏడుగురు భారతీయులు... మరో ఆరుగురు మృతి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (21:37 IST)
ఐఎస్ఐఎస్ పేరు చెబితే అగ్రరాజ్యాలు తలలు పట్టుకుంటాయి. ఆ సంస్థ చేసే అరాచకాలు అలా ఉంటాయి. అయితే ఆ పాపాల్లో భాగస్తులుగా ఏడుగురు ఇండియా నుంచి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అక్కడికెళ్లి ఉగ్రవాదులుగా మారిన భారతీయులు ఉన్నారని నిఘావర్గాలు చెబుతున్నాయి. 
 
ఇలా భారతదేశం నుంచి వెళ్లిన వారిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారు ఉన్నారని తెలిపింది. ఈ ఏడుగురు కాకుండా మరో ఆరుగురు భారతీయులు ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతూ మృత్యువాత పడ్డారని నిఘావర్గాలు వెల్లడించాయి. మరణించిన వారిలో ముగ్గురు ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు, ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడని నిఘావర్గాలు చెప్పాయి. 
 
బతికి ఉన్న ఏడుగురిలో ఒకడ్ని మాత్రమే ఐఎస్ఐఎస్ పోరాటంలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. మిగిలిన ఆరుగురు వంటవాళ్లు, డ్రైవర్లు, పనివాళ్లుగా కుదురుకున్నట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. కాగా, తెలంగాణ నుంచి సిరియా వెళ్లేందుకు 17 మంది అనుమతి కోరగా, వారంతా ఐఎస్ఐఎస్ లో చేరే ప్రమాదం ఉందని భావించిన అధికారులు వారి అనుమతి నిరాకరించినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments