Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ ప్రిన్స్‌ విహార నౌకలో 66 మందికి కరోనా వైరస్...

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (10:17 IST)
జపాన్ దేశానికి చెందిన క్రూయిజ్ షిప్‌లో ఉన్న 66 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నిరూపితమైంది. దీంతో వారందనీ నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 3,700 మంది ఉండగా, వారిలో 1100 మంది సిబ్బంది. టోక్యో నగరానికి దక్షిణంగా ఉన్న యోకోహామా సమీపంలోని సముద్రంలోనే నిలిపి కరోనా వైరస్ ప్రబలకుండా చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఓడలో నుంచి హాంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఓడలోని వారందరినీ రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచారు. ఓడలో నిర్బంధంలో ఉన్నవారిలో 39 మందికి కరోనావైరస్ సోకగా వారిలో 10 మంది జపాన్ దేశస్థులున్నారు. మరో 10 మంది ఓడ సిబ్బంది. మిగతా రోగులు అమెరికా, చైనా దేశాలకు చెందిన వారని జపాన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. 
 
నౌకలోని ప్రయాణికులను క్యాబిన్లలోనే ఉంచి మాస్కులు ఇచ్చి చికిత్స చేస్తున్నారు. వ్యాధి తగ్గితే ఈ నెల 19వ తేదీన ఓడ నుంచి వారిని విడుదల చేయాలని జపాన్ వైద్యాధికారులు యోచిస్తున్నారు. మరోవైపు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ సింగపూర్ దేశానికి వ్యాపించడంతో ఆ దేశంలో పర్యటించవద్దని పలు దేశాలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments