Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా భద్రతా దళాల అదుపులో 60మంది భారతీయులు!

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (08:21 IST)
మలేషియా భద్రతా దళాలు అదుపులో 60 మంది భారతీయులు వున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ భారతీయుడు కొవిడ్-19 లక్షణాలతో మరణించిన ఘటనపై స్పందించిన ఆ దేశ మానవ హక్కుల కమిషన్.. విచారణ చేపట్టింది.

తమిళనాడు, కేరళ, తెలంగాణకు చెందిన చాలా మంది.. హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఈ ఏడాది మార్చిలో కౌలాలంపూర్ వెళ్లారు. వీరంతా మార్చి రెండోవారం నాటికి తిరిగి ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే కరోనా విజృంభించడంతో మలేషియా ప్రభుత్వం మార్చి 18 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హాలిడేస్‌ ఎంజాయ్ చేయడం కోసం వెళ్లిన సుమారు 60 మంది భారతీయులు మలేషియాలో చిక్కుకున్నారు.

ఇదే సమయంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం వేసిన మలేషియా ప్రభుత్వం..వారిని అదుపులోకి తీసుకోవడానికి భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కరోనా కారణంగా అక్కడే చిక్కుకున్న 60 మంది భారతీయులను కూడా అక్కడి భద్రతా దళాలు మే 1న అదుపులోకి తీసుకున్నాయి.

ఈ క్రమంలో భద్రతా దళాల అదుపులో ఉన్న చెన్నైకి చెందిన 67ఏళ్ల జీవ్‌దీన్ ఖాదర్ మస్తాన్ కొవిడ్ లక్షణాలతో మరణించారు. మలేషియా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న 60 మంది భారతీయుల్లో 20 మంది మహిళలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం