Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం : 27 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (11:43 IST)
పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళుతున్న బ‌స్సు లోయ‌లో ప‌డిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు చనిపోయారు. 
 
పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సులో ఒకే కుటుంబానికి చెందిన కొందరు పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్న క్ర‌మంలో ట‌రియోసియానిక్ జాతీయ ర‌హ‌దారిపై అదుపు తప్పిన బస్సు  ఒక్క‌సారిగా లోయ‌లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాద స్థలిలోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం  పెరూ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments