Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం : 27 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (11:43 IST)
పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళుతున్న బ‌స్సు లోయ‌లో ప‌డిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు చనిపోయారు. 
 
పాలొమినో కంపెనీకి చెందిన బ‌స్సులో ఒకే కుటుంబానికి చెందిన కొందరు పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్న క్ర‌మంలో ట‌రియోసియానిక్ జాతీయ ర‌హ‌దారిపై అదుపు తప్పిన బస్సు  ఒక్క‌సారిగా లోయ‌లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాద స్థలిలోనే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం  పెరూ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments