Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్య కోసం వెళ్లిన యువతిని సజీవంగా పాతిపెట్టిన ప్రియుడు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (09:30 IST)
ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే కొందరు అమ్మాయిలు కట్టు తప్పి, ప్రమాదాల్లో చిక్కుకుని, చివరకు ప్రాణాలో కోల్పోతున్నారు. తాజాగా నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతి చివరకు ప్రియుడి చేతిలో సజీవంగా హతమైంది. ఈ దారుణం ఆస్ట్రేలియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రానికి చెందిన 21 యేళ్ల జాస్మిన్ కౌర్ అనే యువతి నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ తారిక్ జోత్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత తారిక్‌లో మార్పు రావడాన్ని గుర్తించిన జాస్మిన్.. దూరం పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని తారిక్ ఆమెపై పగపెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో నార్త్ పాలింప్టన్ ప్రాంతం నుంచి ప్రియురాలిని కిడ్నాప్ చేసిన తారిక్... ఫ్లిండర్స్ రేంజెస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుల్ వైర్లతో చుట్టేసి సజీవంగా పాతిపెట్టాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరగింది. బాధిత యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఆస్ట్రేలియా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో జాస్మిన్‌ను తారిక్ హత్య చేసినట్టు తేలింది. పాతిపెట్టిన ప్రదేశం నుంచి జాస్మిన్ మృతదేహాన్ని వెలికి తీయగా పోస్టు మార్టం రిపోర్టులో అతను చంపిన తీరు బహిర్గతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments