Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా సైనిక దాడి-200 టెర్రరిస్టులు హతం

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:13 IST)
సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా జరిపిన దాడిలో సుమారు 200 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో 24 వాహనాలు ధ్వంసం అయ్యాయని, మరో అర టన్ను పేలుడు పదార్ధాలు ధ్వంసం అయినట్లు సైన్యం పేర్కొంది. 
 
సిరియా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగినట్లు రష్యా అడ్మిరల్‌ అలక్సందర్‌ కార్పొవ్‌ దృవీకరించారు. సిరియాకు ఈశాన్యంలో ఉన్న పల్మైరాలో పలు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని.. ఇక్కడ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని అన్నారు. 
 
ఇక్కడ అక్రమంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతం సిరియా ఆధీనంలో లేదని రష్యా ఆర్మీ తెలిపింది. అర టన్ను పేలుడు పదార్థాలు ధ్వంసమైనట్లు రష్యా వైమానిక దళం అధికారి అలక్సందర్ కార్పోవ్ తెలిపారు. 
 
పల్మైరా ప్రాంతంలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతుండడంతో పాటు భారీ మొత్తంలో మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండడంతో దాడులు జరిగినట్టు సమాచారం. 2015 నుంచి సిరియాలో ఉగ్రవాదులపై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. ఇద్దరు రష్యా సైనికులను గతంలో చంపడంతో ఈ దాడులకు రష్యా పాల్పడుతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments