Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాను : 20 మంది మృతి

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:38 IST)
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే 20 మందికి వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ మంచు తుఫాను ధాటికి టెక్సాస్, ఓక్లహామా, టెన్నెసీ, ఇల్లినాయస్ రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.
 
ముఖ్యంగా, టెక్సాస్‌లో పరిస్థితి మరింత భయానకరంగా ఉంది. విపరీతంగా కురుస్తున్న హిమపాతం కారణంగా ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. 
 
మరోవైపు, కరెంటు కోతలు ప్రజలను మరిన్ని ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. విద్యుత్ కోతల ప్రభావం దాదాపు 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై పడింది. రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
హిమపాతం కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే కరెంటు సరఫరాను నిలిపివేయడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.
 
కరెంటు కోతల కారణంగా ఆసుపత్రుల సేవలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు, టెక్సాస్‌లో ఆరు లక్షల ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో గత వారం రోజుల్లో 130 కార్లు ప్రమాదానికి గురికాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments