Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు.. కాల్పులు.. 18మంది మృతి

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (09:48 IST)
shooting
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం రంగూన్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు నిరసలు, ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, సైనికులు నిరసన కారులను హెచ్చరించారు. 
 
ఆందోళన మరి ఉధృతమవడంతో సైనికులు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్, గ్రైనైడ్లతో కాల్పులు నిర్వహించారు. ఈ ఆందోళనలో సైనికులు, ప్రజల మధ్య ఘర్షన నెలకొంది. దీంతో అక్కడికక్కడే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది.
 
పోలీసులు, సైనికులు ఉక్కుపాదం మోపినా నిరసన నుంచి వెనక్కి తగ్గేది లేదని మయన్మార్ ప్రజలు కంకణం కట్టుకున్నారు. నవంబర్‌లో ఎన్నికల ఫలితాలను సైన్యం గౌరవించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అంగ్ సాంగ్ సూకీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. మరోసారి సూకీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికల్లో గెలవడంతో ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ సైన్యం తిరగబడింది. 
 
మరో ఏడాదిపాటు సైన్యం ఆధీనంలో తమ పాలన కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు మరోసారి సూకీతోపాటు పలువురు నాయకులను నిర్బంధించారు. దీంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. సైనికుల వ్యవహారంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments