Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో విషాదం - చెరువులో పడిన బస్సు - 17 మంది మృతి

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (09:44 IST)
బంగ్లాదేశ్‌లో విషాదం ఘటన జరిగింది. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటోకు దారి ఇస్తుండగా, బస్సు అదుపుతప్పిన బస్సు చెరువులో పడిపోయింది. 
 
భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ఝలకతి సదర్ ఉప జిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు. స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 
 
క్షతగాత్రులతు ఝలకతి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మంచిన ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments