Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్వలో బోల్తాపడిన బస్సు - 17 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (16:54 IST)
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో బస్సు ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. 
 
బంగ్లాదేశ్‌లోని సోనాదంగా నుంచి ఆ దేశ రాజధాని ఢాకాకు 40 మంది ప్రయాణికులతో కలిసి ఆదివారం ఉదయం ఒక బస్సు బయలుదేరింది. ఇది మమదరిపూర్ అనే ఏరియాలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన వారిని గుర్తించాల్సివుంది.
 
మరోవైపు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగం, బస్సులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు  భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments