Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై వర్చువల్‌గా సామూహిక అత్యాచారం.. ప్రపంచంలోనే తొలి కేసు

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (08:41 IST)
యూకేకు చెందిన మైనర్ బాలికపై వర్చువల్‌గా అత్యాచారం జరిగింది. ఈ తరహా కేసు జరగడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. మెటావర్స్‌లో గేమ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. బాలిక అవతార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత తీవ్ర మానసిక గాయాన్ని అనుభవిస్తుందని పేర్కొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలిక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి ఆటలో లీనమై ఉన్న సమయంలో కొంతమంది యువకులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాలిక శరీరంపై ఎలాంటి గాయలు లేనప్పటికీ వాస్తవ ప్రపంచంలో అత్యాచారం జరిగినట్టుగానే ఆమె వ్యవరిస్తోందని, ఆమె తీవ్రమైన మానసిక గాయాన్ని అనుభవిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
 
ఇలాంటి కేసును పోలీసులు దర్యాప్తు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. బాధిత బాలికకు అయిన మానసిక గాయం చాలాకాలం పాటు ఆమెను వెంటాడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టంలో ఇటువంటి వాటికి సంబంధించి ఎలాంటి నిబంధన లేనందున దీనిపై పోలీసులు ముందుకు ఎలా వెళ్తారన్నది సర్వత్ర చర్చనీయాంశమైంది. కాగా, బాధిత బాలిక ఆ సమయంలో ఎలాంటి గేమ్ ఆడుతోందన్న విషయంలో స్పష్టత లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments