Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాహోర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన పాకిస్థాన్ 'గీత'.. డీఎన్ఏ టెస్టుల తర్వాతే అప్పగింత

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (09:45 IST)
పాకిస్థాన్ గీత తలరాత మారనుంది. 15 యేళ్ళ క్రితం రైలులో తప్పిపోయి పాకిస్థాన్‌కు చెందిన భారతీయ యువతి.. ఇపుడు తిరిగి స్వదేశానికి వస్తోంది. సోమవారం ఉదయం లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరింది. మధ్యాహ్నానికి హస్తినకు చేరుకోనుంది. 
 
చిన్నప్పుడు తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరుకున్న చెవిటి, మూగ యువతి గీతకు కరాచీలోని ఈదీ ఫౌండేషన్ ఆశ్రయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. గీతను భారత్‌కు రప్పించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 8 గంటలకు గీత పాకిస్థాన్‌లోని లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరింది. 
 
దీనిపై ఈదీ ఫౌండేషన్ ప్రతినిధి ఫహద్ ఈదీ స్పందిస్తూ.. గీత వెంట నేను, మా తండ్రి ఫైసల్ ఈదీ, మా అమ్మ, మా నాన్నమ్మ బిల్‌ఖ్వాస్ ఈదీ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నాం అంటూ ఆదివారం కరాచీలో మీడియాకు చెప్పారు. 
 
ఇప్పటికే గీత బీహార్‌లో తన కుటుంబం ఉంటున్నట్టుగా ఫొటోల ఆధారంగా గుర్తించిందని, డీఎన్‌ఏ పరీక్షల్లో పాజిటివ్‌గా వస్తే ఆ కుటుంబానికి గీతను అప్పగిస్తామని భారత అధికారులు చెపుతున్నారు. ఒకవేళ పరీక్షలు నెగెటివ్‌గా వస్తే.. గీతకు ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించి, తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకుంటామని భారత హైకమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments