Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవయవాలు తీసుకున్నారు.. శవాలను పడేశారు.. దంతాలను కూడా?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:35 IST)
టాంజానియా దేశంలో దారుణ ఘాతుకం. పది మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి, వారి అవయవాలను తీసుకుని శవాలను పడేసిన ఘటన టాంజానియా దేశంలోని నిజోంబీ జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆ జిల్లాలో పది మంది పిల్లలు అపహరణకు గురయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. 
 
కిడ్నాప్ అయిన నెలరోజుల తర్వాత పిల్లల శవాలు లభ్యమయ్యాయని, వాటి నుండి అవయవాలు తీసివేసి ఉన్నారని టాంజానియా డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి ఫాస్టిన్ నిడుగుల్లీ వ్యక్తం చేసారు. అవయవాలను సేకరించడం కోసం ఏడేళ్ల వయస్సు గల పిల్లల్ని వారి ఇంటి దగ్గర నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారని మంత్రి వివరించారు. 
 
వారి నుండి ప్రధాన అవయవాలతో పాటు దంతాలు కూడా తీసుకున్నారని పోలీసుల సమాచారం. టాంజానియాలో ప్రతి 1500 మంది పిల్లల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ విధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపి అవయవాలను వైద్యులకు విక్రయిస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఎట్టకేలకు టాంజానియా పోలీసులు ఈ ఘటనపై స్పందించి అప్రమత్త చర్యలు తీసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments