అరికెలతో వడలు... ఎంతో రుచి, ఆరోగ్యం

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (15:52 IST)
మనం రకరకాల పిండి వంటలను తింటూ ఉంటాం. ఇవి మంచి రుచిని ఇస్తాయి. ఇవేకాకుండా చిరుధాన్యాలతో తయారుచేసుకునే వంటకాలు మంచి రుచితో పాటు, మనలను అనేక అనారోగ్య సమస్యల నుంచి  కాపాడతాయి. శరీరానికి మంచి పటుత్వాన్ని ఇవ్వడంలో చిరుధాన్యాలు ప్రధానపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా అరికెలలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా పీచుపదార్ధం ఉండటం వలన బరువు తగ్గడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వీటితో పిల్లలకు ఇష్టమైన రకరకాల స్నాక్స్
తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు అరిక వడలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు... 
అరిక బియ్యం-250 గ్రాములు
శనగపప్పు-150 గ్రాములు
ఉల్లి తరుగు-అరకప్పు
పచ్చిమిర్చి-2 చెంచాలు
కరివేపాకు- 2 రెబ్బలు
జీలకర్ర -1 చెంచా, 
అల్లం తరుగు- 1 చెంచా, 
ధనియాలు-2చెంచాలు
ఉప్పు-తగినంత
నూనె- వడలు ఏపుకునేందుకు సరిపడా
 
తయారుచేసుకునే విధానం... అరికబియ్యం ,శనగపప్పు 3నుండి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానిన అరికెలు, శనగపప్పుకు ధనియాలు, అల్లం చేర్చుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, జీలకర్ర ఉప్పు తగినంత కలుపుకొని మూకుడులో నూనె పోసుకొని వడలు కాల్చుకోవాలి.

ఈ వడలను పులిహోరలోను, సాయంత్రం టిఫిన్‌లా ఉపయోగించుకోవచ్చు. శనగపప్పు ఇష్టపడనివారు బొబ్బర్లు కానీ, పెసరపప్పు కానీ తీసుకోవాలి. అంతేకాదు వడ పిండిలో మెంతికూర గాని, ములగాకు కానీ, తోటకూర కానీ కలుపుకొని వడలు కాల్చుకోవచ్చు. వడ పిండిలో కొంచెం ఇంగువ కూడా కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి నానబెట్టటానికి సమయం లేకపోతే వేడినీళ్లు కాసి అందులో 2 గంటలు నానపెడితే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను..?

పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా

కేసీఆర్‌కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments