గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తరువాత టమాటా ముక్కలు చేర్చాలి. ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. మరికాసేపయ్యాక ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. ఐదారునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది. అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర సిద్ధం అయినట్టే.