నోరూరించే ఫిష్ ఫ్రై.. తయారీ ఎలా?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2016 (15:30 IST)
వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అని అడిగితే అందరు చెప్పే సమాధానం చేప. చేపల్ని ఎక్కువగా తినడం వల్ల ఆడవాళ్లు, మగవాళ్లు డిప్రెషన్‌ రిస్కులో పడరని నిపుణులు అంటున్నారు. చేపల్లో పోషక పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎవరైనా చేపలు ఎక్కువ తింటున్నారని చెపితే వారు ఎంతో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తింటున్నారని అర్థం. 
 
చేపల్లో అనేక ప్రోటీలను, న్యూట్రీషియన్స్, విటమినులు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ 'ఏ' కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ 'ఏ' తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు దోహపడుతుంది. రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. 
కావలసిన పదార్థాలు:
ముల్లు లేని చేపలు : 2 పెద్దవి 
గుడ్లు : 2 తెల్ల సొన
ధనియాల పొడి : 1 స్పూన్
గరంమసాలా :  1 స్పూన్
అల్లం, వెల్లుల్లి : 1 స్పూన్
నిమ్మరసం : తగినంత
కారం : 2 స్పూన్ 
పసుపు : చిటికెడు
బ్రెడ్‌ పౌడర్‌ : తగినంత
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా
 
తయారుచేసే విధానం :
ముందుగా చేపను శుభ్రంగా కడిగి.. చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. తర్వాత ఈ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, అల్లంవెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి, కారం, గరంమసాలా వేసి బాగా కలియబెట్టాలి. ఈ ముక్కలను ఫ్రిజ్‌లో అరగంట ఉంచాలి. ఇప్పుడు గుడ్లను గిలకొట్టి ముక్కల్ని ముంచి, బ్రెడ్‌ పౌడర్లో దొర్లించి నూనెలో దోరగా వేగించాలి. అంతే నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

Show comments