సేమ్యాను, సగ్గు బియ్యాన్ని విడివిడిగా దోరగా వేయించాలి. దళసరి అడుగున్న వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి అవి మరిగాక సేమ్యా, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు తురిమిన బీట్రూట్ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రాగిపిండిని జతచేసి కొద్దిగా నీరుపోసి ఉండలు లేకుండా చూసి, ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి అడుగంటకుండా తిప్పి పంచదార వేసి కలపాలి.
పాయసం చిక్కబడ్డాక యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్లు వేసి దించేయాలి. పాయసం వేడి తగ్గి గది ఉష్ణోగ్రతకు వచ్చాక కాచి చల్లార్చిన పాలను అందులో కలిపి సర్వ్ చేయాలి. చూసేందుకు పింక్ కలర్లో అందంగా కనిపించే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మంచి రక్తపుష్టిని కూడా కలిగిస్తుంది.