Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే "నువ్వుల పచ్చడి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
నువ్వుల.. 150 గ్రా.
పచ్చిమిర్చి.. 8
చింతపండు.. 50 గ్రా.
వెల్లుల్లి.. 15 రెబ్బలు
ఉప్పు.. తగినంత

తాలింపు కోసం..
ఎండుమిర్చి.. 4
ఆవాలు, జీలకర్ర.. చెరో టీ.
కరివేపాకు.. 20 రెమ్మలు
నూనె.. తగినంత

తయారీ విధానం :
చింతపండుని అరకప్పు నీళ్లలో వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. గింజలు తీసేసి గుజ్జులా చేసుకోవాలి. బాణలిలో నువ్వులు వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. పచ్చిమిర్చిని నేరుగా గ్యాస్‌మంట లేదా బొగ్గులమీద కాల్చాలి. కాల్చిన మిర్చి, వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, చింతపండుగుజ్జు అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.

బాణలిలో నూనె వేసి తాలింపు కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటితో తాలింపు చేసి నూరుకున్న మిశ్రమంలో కలిపితే నువ్వుల పచ్చడి తయార్..! ఇది దోశెలు, ఇడ్లీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల్లో పీచు పదార్థాలు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రించి, కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచటంలో కూడా సహకరిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Show comments