Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి... ఆ తర్వాత తాగితే...

మనం నిత్యం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానము ఉంది. దీనిని కూరగాను, సాంబారులోను వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషధ గుణాలను ఇప్పుడు తెలు

Webdunia
గురువారం, 31 మే 2018 (17:54 IST)
మనం నిత్యం ఆహారంగా వాడే దుంపకూరల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానము ఉంది. దీనిని కూరగాను, సాంబారులోను వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషధ గుణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి.
 
2. నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండుమూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
 
3. నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి.
 
4. ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి.
 
5. ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే పురుషులలో ఏర్పడే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.
 
6. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా భాగాలపై పట్టిస్తుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.
 
7. 10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో తగినంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments