రోజుకో కప్పు పెరుగు తినండి.. కాస్తంత స్లిమ్‌గా ఉండండి!!

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (14:56 IST)
చాలా మంది యువతీ యువకులు ముఖ్యంగా యువతులు స్లిమ్‌గా ఉండేందుకు రకరకాల ఆహార నియమాలను పాటిస్తుంటారు. అధిక సంఖ్యలో డైట్ కంట్రోల్ చేసి తమ బరువును, బొజ్జను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మీ బొజ్జ తగ్గి స్లిమ్‌గా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు. 
 
200 గ్రాముల పెరుగులో దాదాపు 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుందని పరిశోధనలో వెల్లడైనట్లు వారు తెలిపారు. క్యాల్షియం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్‌గా వుండడానికి దోహదపడుతుంది. మన శరీరానికి కావాల్సినంత క్యాల్షియం తీసుకోకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయేది కడుపులోనేనన్నవిషయం తెలిసిందే. 
 
అంతేకాకుండా పెరుగు లేప్టీన్ అనే హార్మోన్‌ను పెంపొందిస్తుంది. ఇది శరీరంలోని శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. పెరుగులోనున్న కాసిన్ని ప్రొటీన్లుకూడా భోజనం చేసామన్న తృప్తినిస్తుంది. పెరుగు తీసుకుంటే ఇతరత్రా చిరుతిండ్ల జోలికి పోరంటున్నారు పరిశోధకులు. చిరుతిండ్లు తీసుకుంటే అనాయాసంగా బొజ్జపెరిగి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి శరీరాకృతిని కాపాడుకోవాలనుకుంటే పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు పరిశోధకులు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జంప్ అవుతున్న విద్యార్థులు

హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ.. అపూర్వమైన గౌరవం.. ట్రంప్ కృతజ్ఞతలు

కాకినాడలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన.. హోర్డింగ్‌లు అదుర్స్ (video)

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ.. ఏపీలోనూ భారీ వర్షాలు..

జూన్ 27, 2026 శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారతి గైకొనవే మా సమంత అంటూ అభిమానులు, వీడియో

Balan: The Boy ట్రెండింగ్‌ బాలన్: ది బాయ్.. విమర్శకుల నుంచి ప్రశంసలు

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Show comments