Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే?

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (22:00 IST)
బొప్పాయి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచుపదార్థాలతో పాటు పపైన్ అనే జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి.
 
బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 
బొప్పాయి పాలల్లో కొబ్బరినూనె లేదా నెయ్యి కలిపి గజ్జి, చిడుము వంటి చర్మవ్యాధులపై పూయడం వల్ల అవి తగ్గిపోతాయి.
 
ముసాంబరాన్ని బొప్పాయి పాలతో నూరి సెనగగింజంత మాత్రలు చేసి రెండు పూటలా ఒక్కో మాత్ర తీసుకుంటుంటే స్త్రీలలో ఋుతుక్రమం బాగా విడుదలవుతుంది. బొప్పాయి కాయను కొబ్బరికోరులా తరిగి కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి స్తనాల్లో గడ్డలుపై వేసి కట్టుకడుతుంటే నొప్పులు, పోటు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments