Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లజోడు పెట్టుకుంటే ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చల నివారణకు చిట్కాలు!

ప్రస్తుత కాలంలో కళ్లజోడు పెట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. కొందరు నేత్ర సమస్యల కారణంగా పెట్టుకుంటే మరికొందరు ఫ్యాషన్ కోసం కంటి అద్దాలను పెట్టుకుంటారు.

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (12:03 IST)
ప్రస్తుత కాలంలో కళ్లజోడు పెట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. కొందరు నేత్ర సమస్యల కారణంగా పెట్టుకుంటే మరికొందరు ఫ్యాషన్ కోసం కంటి అద్దాలను పెట్టుకుంటారు. అయితే, అద్దాలు ఎందుకు పెట్టుకున్నా సరే.. ముక్క మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. క్రమం తప్పకుండా, రేయింబవుళ్లు పెట్టుకునే వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చల వల్ల అంద విహీనంగా మారే అవకాశం లేకపోలేదు. ఇలాంటి మచ్చలను చిన్నపాటి చిట్కాలతో ఇంటిపట్టునే నివారించుకోవచ్చు. అవేంటో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
కలబంద రసం నల్లటి మచ్చలను తొలగించే గుణం ఉంది. ఇది ముక్కపై నల్లని మచ్చ ఉన్న ప్రాంతంలో ప్రతి రోజూ రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. 
 
దోసకాయ ముక్కలు పిగ్మెంటేషన్ ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. నల్లటి మచ్చ ఉన్న ముక్కుపై దోసకాయ ముక్కను పెట్టడం వల్ల ఈ మచ్చలు మాయమయ్యే అవకాశం ఉంది. 
 
సహజంగానే నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిమ్మరసం కళ్ళజోడు మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసం, నీరు లేదా తేనె మిశ్రమాన్ని నల్లటి మచ్చలపై పూయడం వల్ల ఈ మచ్చలను తొలగించవచ్చు. 
 
ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించటంలో తేనే సహాయపడుతుంది. నల్లని మార్కులపై తేనెను రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు నల్లని మార్కులపై రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
 
బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అందువలన కళ్ళజోడు నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. అలాగే, నారింజ తొక్కల పొడి కళ్ళజోడు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది. నారింజ తొక్కల పొడిలో కొంచెం పాలను పోసి పేస్టుగా చేయాలి. ఈ పేస్టుని ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసినట్టయితే ఫలితం కనిపిస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments