Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరగాలా? రోజూ ఓ కప్పు ఉడకబెట్టిన శెనగలు ఆరగించండి...

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (13:04 IST)
ఎన్నో పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. వీటిలో ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ముఖ్యంగా ఉడకబెట్టుకుని లాగించేస్తుంటారు. అయితే ప్రతి రోజూ ఉడకబెట్టిన శెనగలను ఓ కప్పు ఆరగించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో శెనగలను భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
 
* మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
* సన్నగా ఉండేవారు రోజూ వీటిని ఆరగించడం వల్ల త్వరితగతిన బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో కూడా కొవ్వు పెద్దగా పేరుకునిపోదు.
 
* శెనగలను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌, ఫైబ‌ర్ అందుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
 
* అలాగే, మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
 
* శెనగలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు.
 
* రక్త హీనత సమస్యతో బాధపడేవారు ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments