Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కోసం కోట్లు కోట్లు పెడుతోంది.. ఎవరో తెలుసా?

ప్రముఖ గాయని, నటి సెలీనాకు కోట్లు కోట్లు కుమ్మరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు అంటే లైకులు, కామెంట్లు, షేరింగ్‌ల కారణంగా సెలీనా కోట్లు ఖర్చు పెడుతోంది. ఒక్కో పోస్టుకు వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగ

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (11:39 IST)
ప్రముఖ గాయని, నటి సెలీనాకు కోట్లు కోట్లు కుమ్మరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు అంటే లైకులు, కామెంట్లు, షేరింగ్‌ల కారణంగా సెలీనా కోట్లు ఖర్చు పెడుతోంది. ఒక్కో పోస్టుకు వేలల్లో కాదు లక్షల్లో కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెడుతోంది. సెలీనాకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వుంది. గాయనిగా, నటిగా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. అలాగే సెలీనాకు 141.5 మిలియన్ ఫాలోవర్స్‌ వున్నారు. 
 
ఈ ఫాలోవర్స్ అంతా సెలీనా పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఆమె ఒక్క పోస్ట్‌ చేస్తే చాలు లక్షల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి పడుతుంటాయి. సెలీనా పెట్టే పోస్టులపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. బడా కంపెనీలు దృష్టి సారించాయి. సెలీనా ఏదైనా పోస్టు పెడితే విపరీతంగా ప్రచారం జరగడంతో దాన్నిక్యాష్ చేసుకునేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి.
 
ఇన్‌స్టాగ్రామ్‌లో సెలీనా తమ కంపెనీకి సంబంధించి పోస్ట్ చేస్తే అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సెలీనా ప్రముఖ జర్మన్ కంపెనీ అయిన ప్యూమాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. సెలీనా పెట్టే ఒక్కో పోస్ట్‌కు 3.5 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకుంటుంది. అంటే మన కరెన్సీలో 24 కోట్ల 75 లక్షల రూపాయలు. ప్యూమా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, షూస్‌ వేసుకుని సెలీనా దిగిన ఫొటోలకు లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. 
 
అయితే ప్యూమా నుంచి సెలీనా తీసుకునే పారితోషికంలో కొంతభాగం ఓ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌కు విరాళంగా ఇస్తోంది. రెండేళ్ల క్రితం సెలీనాకు ల్యూపస్‌ వ్యాధి సోకింది. దాంతో ఆమెకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. మృత్యువుతో పోరాడిన సెలీనాను ఆమె స్నేహితురాలు హాలీవుడ్ నటి ఫ్రాన్సియా రైజా కాపాడారు. ఒక కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు. తనలా ఈ వ్యాధితో ఇంకెవరూ బాధపడకూడదని, మెరుగైన ఔషధాలు తయారుచేసేందుకు పరిశోధనలు చేస్తున్న సంస్థలకు సెలీనా విరాళాలు ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments