Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా సంగ్రామం.. కురుక్షేత్ర యుద్ధం.. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు?

ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ పవిత్ర గ్రంథం ఉంది. అదే హిందువులకు మాత్రం పలు వేదాలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ముందుగా హిందువులకు పవిత్ర గ్రంథంగా భ

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (15:19 IST)
ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అంటూ పవిత్ర గ్రంథం ఉంది. అదే హిందువులకు మాత్రం పలు వేదాలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ముందుగా హిందువులకు పవిత్ర గ్రంథంగా భగవద్గీతనే పేర్కొంటారు. భగవద్గీతలోని 18 తాత్పర్యాలను చదివి.. దానిప్రకారం జీవితాన్ని గడపడం ఉత్తమం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. అంతేకాదు.. ఏ పని చేసినా ప్రతిఫలం మాత్రం భగవంతునికే అర్పించడమే గీతాసారాంశం. 
 
భగవద్గీత ద్వారా జీవిత సారాంశాన్ని బోధించిన శ్రీ కృష్ణ పరమాత్ముడు.. కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాండవుల పక్షాన నిలబడినందుకు గల కారణం ఏమిటని తెలుసుకోవాలనుందా? అయితే చదవండి. పాండవులకు, కౌరవులకు జరిగిన మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అందరి వాడు. అయితే పాండవులకే శ్రీకృష్ణుడు మద్దతివ్వాల్సిన అవసరం ఏమిటనే దానిపై ఆరా తీస్తే.. ఒకసారి ద్వారకకు అర్జునుడు, దుర్యోధనులిద్దరూ వెళ్తారు. యుద్ధానికి శ్రీకృష్ణుడి సాయం కోరుతారు.
 
శ్రీ కృష్ణుడేమో.. ఆయుధం చేతనెత్తనంటాడు. నిరాయుధునిగా యుద్ధరంగం ప్రవేశిస్తానంటాడు. నిరాయుధుడైన కృష్ణుడిని దుర్యోధనుడు కోరుకోడు. సేనాబలం కోరుకుంటాడు. అదే అర్జునుడు శ్రీకృష్ణుడే కావాలనుకుంటాడు.  ఆపై యుద్ధ మైదానంలోకి శ్రీకృష్ణుడి రథ సారథ్యంలో ప్రవేశించిన అర్జునుడు.. యుద్ధరంగంలో నిల్చున్న సేనలందరూ తన బంధువులు, సోదరులు, గురువులు కావడంతో శ్రీ కృష్ణునితో యుద్ధం వద్దంటాడు.
 
అప్పుడే శ్రీ కృష్ణుడు ధర్మ సంరక్షణార్థం బంధువులను, గురువులను, సోదరులను మట్టుబెట్టాల్సిన బాధ్యత నీపై వుందని గీతోపదేశం చేస్తాడు. నీ కర్తవ్యాన్ని నీవు చేస్తే.. ఆ ఫలితాలన్ని తనకే చేరుతాయని కృష్ణుడు ఉద్భోధిస్తాడు. అందుకే ఏ పని చేసినా ఫలితం ఎదురుచూడకూడదని అది దేవుడికే వదిలేయాలంటారు. ఇలా ధర్మాన్ని రక్షించేందుకు శ్రీ కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడ్డాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments