Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాదంలో పురుగులు..! అక్కడే భక్తుల ఆందోళన.. గంటా సీరియస్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (11:25 IST)
సింహాద్రి అప్పన్న ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో బతికిన పురుగులు దర్శనమిచ్చాయి. వీటినే భక్తులకు పంపిణీ చేసిన ఆలయ కమిటీ పురుగుల వ్యవహారాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేసింది. అయితే భక్తులు అక్కడే ధర్నా చేయడంతో ఇది కాస్త బహిర్గతమయ్యింది. ఈ సంఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గిరి ప్రదర్శన చేసుకుని స్వామిదర్శనం చేసుకున్న తరువాత లడ్డూ కౌంటర్‌లో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. ఆ లడ్డూలలో బతికి కదలాడుతున్న పురుగులు, వాటి గుడ్లు, బూజు కనిపించడంతో భక్తులు అవాక్కయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. చాలా మంది భక్తులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. 
 
ఈ విషయం ఫిర్యాదు చేయడానికి ఆలయ ఈవో వద్దకు వెళ్ళితే ఆయన గుట్టుచప్పుడు కాకుండా వారిని కొండ దింపే ప్రయత్నాలు చేశారు. ఇలా చాలామంది భక్తులకు జరగడంతో అందరూ అక్కడే ధర్నాకు దిగారు. చివరకు విషయం మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలియడంతో ఆయన ఆలయ ఈవోపై సీరియస్ అయ్యారు. అనంతరం నాణ్యత ఉన్న ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments