తిరుమల చేరుతున్న భక్త జనసందోహం

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (14:28 IST)
వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దైవం కొలువున్న వేంకటనాథుని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే నిజంగానే వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని హిందువులు నమ్ముతారు. ఆ నమ్మకం ఎంతో బలమైనది. రాకెట్ వేగంతో మానవుడు ముందుకు దూసుకుపోతున్నా.. ఆ రాకెట్ ను ప్రయోగాన్ని విజయవంతం చేయమని వెంకన్న స్వామిని కోరుకునేంత నమ్మకం. 
 
అందుకే పండితులు, పామరులు అనే తేడా లేకుండా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల కిటకిటలాడుతుంది. పైగా ఏడాది ఆరంభం కూడా కావడంతో జనం తిరుమల బాట పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు ఇలా ఒకరేంటి ప్రభుత్వ సారధలందరూ తిరుమలకు క్యూ కడుతున్నారు. 
 
వీరి సంగతి ఇలా ఉంటే ఇప్పటికే సామాన్య భక్తులు తిరుమల చేరుకుని క్యూ కాంపెక్సులోకి చేరేందుకు సన్నద్దమయిపోయారు. వారిని మధ్యాహ్నాం 12 గంటల నుంచి లోని అనుమతించడంతో టిబిసి ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. ద్వారాల వద్ద తొపులాటలు జరుగుతున్నాయి. రోడ్లపై జనమే జనం కనిపిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు క్యూలైన్లోకి అడుగిడితే వీరికి గురువారం ఉదయం 5 గంటల నుంచి దర్శన భాగ్యం లభిస్తుంది. 
 
వాస్తవానికి 1.45 గంటల నుంచే దర్శనం ఉన్నప్పటికీ ఆ సమయమంతా కైంకర్యాలకు, విఐపీలకు సరిపోతుంది. తరువాత సామాన్య భక్తులకు సాయంత్రం వరకూ దర్శన భాగ్యం కలుగుతుంది. ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం ఉండడంతో రోజుల తరబడి అయినా సరే క్యూలైన్లలో వేచి ఉండడానికి భక్తులు సిద్ధపడిపోయారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

లేటెస్ట్

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

Show comments