Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 యేళ్ళ చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని విలీనం చేసుకున్న టీటీడీ

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (08:03 IST)
చుట్టుపట్ల ఆలయాలను తనలో విలీనం చేసుకునే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. దాదాపుగా 5 వందల యేళ్ళ చరిత్ర కలిగిన మరో కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తనలో విలీనం చేసుకుంది. 
 
16 శతాబ్ధంలో నిర్మితమైన కోదండ రామాలయం చంద్రగిరి పట్టణంలో కొలువుదీరి ఉంది. అయితే ఆలనా పాలనా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతిదేవస్థానంలో కలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి బుధవారం మధ్యాహ్నం ఆ పత్రాలను తీసుకున్నారు. దీంతో చంద్రగిరి కోదండ రామాలయం టీటీడీ గొడుగు కిందకు వచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments