క్యూలైన్లు తనిఖీ చేసిన టీటీడీ ఈవో

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (21:48 IST)
వైకుంఠ ఏకాదశి దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు శనివారం సాయంత్రం తిరుమలలోని క్యూ కాంప్లెక్సులను తనిఖీ చేశారు. ఏటీజీహెచ్, వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి పుట్ పాత మార్గాలను ఆయన పరిశీలించారు. 
 
రెండు పర్వదినాలు ఒకే రోజు జనవరి 1, 2015 వస్తున్న కారణంగా తాము అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఈవో చెప్పారు. రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే తాము ఏర్పాట్లను తగు విధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు. కనీసం 40 వేల మంది కంపార్టుమెంట్లలో కూర్చునే సౌకర్యాలను పరిశీస్తున్నామని చెప్పారు. 
 
ఏటిజీహెచ్ నుంచి ఆలయం లోపలి వరకూ కనీసం 2.7 కిలోమీటర్లు దూరం ఉంటుందని ఈ ప్రాంతంలో సింగిల్ లైను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ ఈ రమేష్ రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments