Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వచ్చే లోపే యాగం ముగిస్తారా..! రుత్వికులపై టీటీడీ ఛైర్మన్ మండిపాటు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (11:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి రుత్వికులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాను వచ్చే లోపే యాగాన్ని ముగించడం.. ఆయనకు ఎక్కడ లేని కోపం తెప్పించింది. నిర్ణీత సమయం కంటే ముందుగా యాగం ఎలా అయిపోయిందని మండిపడ్డారు. అంతమాత్రనా తనను ఎందుకు ఆహ్వానించారని నిలదీశారు. తిరుమలలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమల పారువేట మండపం వద్ద మూడు రోజుల నుంచి వరుణయాగం జరుగుతోంది. మూడోరోజు కార్యక్రమానికి రుత్వికులు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని ఆహ్వానించారు. ఉదయం 9.30 గంటలకు రావాలని పండితులు ఆహ్వానించారు. ఆ సమాచారం చైర్మన్‌కు అందలేదు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ యాగం జరుగుతుందని మాత్రం ఆయనకు తెలుసు. దీంతో ఆయన సతీసమేతంగా మధ్యాహ్నం 12.50 గంటలకు సతీసమేతంగా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యాగం ముగిసింది.  
 
దీంతో ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహించాల్సిన యాగాన్ని 12 గంటలకే ఎలా ముగిస్తారని మండిపడ్డారు. మధ్యాహ్నం 1 గంట వరకు యాగం ఉంటుందని చెబితేనే తాను  వచ్చానని లేనిపక్షంలో కార్యక్రమానికి వచ్చేవాడిని కానని అక్కడున్న రుత్వికులపై విరుచుకుపడ్డారు. అంతమాత్రానికి తనను ఎందుకు ఆహ్వానించారని నిలదీశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments