శ్రీవారి సేవకులకు మరింత శిక్షణ అవసరం

Webdunia
బుధవారం, 6 మే 2015 (07:56 IST)
తిరుమలలో వివిధ విభాగాలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలని తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధికారులను కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, వారికి శ్రీవారి సేవకుల సేవలు ఎంతో అవసరమని అన్నారు. 
 
అందుకుతగ్గట్టు శ్రీవారి సేవకులు భక్తులతో మెలిగే విధానం, భక్తి, సహనభావం పెంపొందేలా ప్రతి విభాగంలోని అధికారులు తగిన సూచనలు తప్పనిసరిగా చేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2, ఇతర ప్రాంతాల్లో వృథాగా ఉన్న కుర్చీలు, బల్లలు తదితర సామగ్రిని వెంటనే తొలగించాలని సూచించారు. వేసవి కావడంతో తాగునీటి కోసం వచ్చే జంతువులకు అందుబాటులో ఉండేలా ఘాట్‌ రోడ్డు వెంబడి నీటితొట్టెలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సిన అవసరముందని అటవీ అధికారులను కోరారు. 
 
వేసవిలో భక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇతర మందులను అవసరమైనంత స్టాక్‌ ఉంచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. తిరుమలలోని వంట చెరుకు డిపోను రింగ్‌ రోడ్డు ప్రాంతానికి మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం కురిసినపుడు ఎటిసి ప్రాంతంలో ఎక్కువగా వర్షపునీరు నిల్వ ఉంటోందని, భక్తులకు ఇబ్బంది లేకుండా సత్వరం తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

లగ్జరీ కారును నడిపిన 11ఏళ్ల కుమారుడు.. తండ్రి అరెస్ట్.. ఎక్కడ? (video)

ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్

పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేన

మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

కేవలం రూ.120 ఖర్చుతో శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు..

Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

Show comments